ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ సందర్బంగా వర్మ సర్ ప్రైజ్..

SMTV Desk 2019-01-18 10:51:41  Ram Gopal Varma, Lakshmi's NTR, surprise

హైదరాబాద్, జనవరి 18: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మాజీ ముఖ్య మంత్రి ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కాగా ఈరోజు ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ సందర్బంగా ఓ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. "ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ అయిన జనవరి 18న సాయంత్రం 5 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాణం పోసుకోబోతోంది" అని ఆయన ట్వీట్ చేసారు.


ఈ నేపథ్యంలో చిత్రం నుంచి ప్రీ లుక్ ను విడుదల చేస్తారా? ట్రైలర్ రిలీజ్ చేస్తారా? టీజర్ వస్తుందా? లేదా మరో సాంగ్ ఏదైనా రిలీజ్ చేస్తారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వర్మ పెట్టిన ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా, ఆయన చేసే ప్రకటన కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.