జగన్ పై హత్యాయత్నం కేసు : ముగిసిన ఎన్ఐఎ విచారణ

SMTV Desk 2019-01-17 17:46:17  YS Jagan mohan reddy, Attempt to murder case, NIA

హైదరాబాద్, జనవరి 17: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు విచారణను ఎన్ఐఎ ఈ రోజు హైదరాబాద్ లో పూర్తి చేసింది. కాగా రేపు ఉదయం శ్రీనివాసరావును కోర్టుకి హాజరుపరచనున్నారు. శ్రీనివాసరావు లాయర్ సలీం సమక్షంలోనే ఈ విచారణ సాగింది.

ఈ వారం రోజుల పాటు శ్రీనివాసరావు విచారణకు సంబంధించి తెలుసుకొన్న విషయాలపై ఎన్ఐఏ అధికారులు సమగ్రంగా నివేదికను తయారు చేస్తున్నారు.రేపు ఉదయానికి శ్రీనివాసరావును విజయవాడకు తీసుకెళ్లనున్నారు. శ్రీనివాసరావును శుక్రవారం నాడు కోర్టులో హాజరుపర్చనున్నారు.