బీసీలపై కేసీఆర్ కపట ప్రేమ...!!

SMTV Desk 2019-01-17 15:24:48  Chandrababu, KCR, BC, KTR, YS Jagan mohan reddy, Talasani srinivas yadav

అమరావతి, జనవరి 17: గురువారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు ఎలక్షన్ మిషన్ 2019 పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు స్పందన లేదు అందుకే నిన్న వైసీపీ అధినేత జగన్ తో తెరస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హడావుడిగా సమావేశమయ్యారని చంద్రబాబు అన్నారు. అంతేకాక బీజేపీ అజెండా అమలు చేసేందుకు ఫెడరల్ ఫ్రంట్ అని విమర్శించారు. బీజేపీ వ్యతిరేఖ కార్యకలపాల వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు. అసహనం కప్పెట్టేందుకు కుట్రలకు తెరదీశారని అన్నారు. అంతేకాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని కేసీఆర్ అన్నారు అని గుర్తు చేశారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారన్నారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనివ్వలేదని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.





కాగా ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కూడా ఏపీ సీఎం ధ్వజమెత్తారు. దేవుని మొక్కు తీర్చుకోడానికి వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. అంతేకాక ఏపీలో తెరాస నేతలు పర్యటనలో టీడీపీ నేతలు పాల్గొనరాదని