హైదరాబాద్, జనవరి 17: నేటి నుండి రెండో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.
సభా నాయకుని హోదాలో చంద్రశేఖర్ రావు ముందుగా ప్రమాణం చేశారు. ఎన్నికలు జరిగిన సుమారు 36 రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశమైంది. ఈ నెల 20 వరకు సమావేశాలు జరగనున్నాయి.
శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
— BRS Party (@BRSparty) January 17, 2019
Hon’ble CM Sri KCR taking oath as MLA in Telangana Assembly. pic.twitter.com/dCq2fDok87