కాంగ్రెస్ కండువా కప్పుకున్న టీఆరెస్ కీలక నేతలు

SMTV Desk 2019-01-17 12:03:54  KCR, TRS, Congress party, Sara sambaiah

భద్రాద్రి, జనవరి 17: తెరాస పార్టీకి చెందిన కీలక నేత పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. భుధవారం సాయంత్రం కొత్తగూడెం జిల్లా కరకగూడెం తెరాస పార్టీ మండల అధ్యక్షుడు సార సాంబయ్యతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.అనంతరం సాంబయ్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీలోని కొందరు నాయకులు వొంటెద్దు పోకడలు పోతూ పార్టీని ఆబాసుపాలు చేస్తున్నారని ఈ విషయమై పలుమార్లు మాజీ ఎమ్మెల్యే పాయం దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరామన్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చే రేందుకు మరికొందరు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.