హైదరాబాద్, జనవరి 16: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్, లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో కేటీఆర్, పలువురు టీఆర్ఎస్ నేతలు జగన్ ను కలిశారు. ఈ భేటీలో ఎన్టీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడుతున్న ఫెడరల్ ఫ్రంట్ ను బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలు ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ అనంతరం కేటీఆర్, జగన్ లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.