హైదరాబాద్, జనవరి 14: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి జనసేన కార్యకర్తలు, అభిమానుల పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సామజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరంగా దుష్ప్రాచారాలు చేస్తున్నారని హైదరాబాద్ పిసి అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
తమపైనా , తమ కుటుంబ సభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సిపి ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.