అతివేగం తీసింది మరొ ఇద్దరి ప్రాణం

SMTV Desk 2017-07-30 11:05:27  cars, wera, killed, in, canal

పశ్చిమ గోదావరి, జూలై 30 : అతివేగం ప్రమాదకరమని ఎన్ని సార్లు హెచ్చరించిన పదే పదే ప్రాణాలు కొలిపోతున్న వైనం. అలాంటి సంఘటనే, పశ్చిమ గోదావరి జిల్లా లో చోటు చేసుకుంది. నిడదవోలు మండలం తాళ్ళపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే, తాళ్ళపాలెం దగ్గర అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి పశ్చిమ డెల్టా కాలువలోకి పడి పోయింది. స్థానిక సమాచారం ప్రకారం కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతులు ఎవరు అనే అంశం పై ఇంకా స్పష్టత రాలేదు.