నిర్మాతల కొంప ముంచుతున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు'....????

SMTV Desk 2019-01-13 20:18:37  NTR Kathanaakudu, Balakrishna, Krish jagarlamudi, 14Reels, AK Entertainment, Anil sunkara

హైదరాబాద్, జనవరి 13: సీనియర్ ఎన్టీఆర్ జీవితధారంగా తెరక్కెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు . బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు నిరాశ మిగిల్చేలా ఉంది. స్టార్ హీరోలతో సినిమాలు తీసిన 14 రీల్స్, ఏకె ఎంటర్టైన్మెంట్ అనీల్ సుంకర ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటికే అనీల్ సుంకర కుర్ర హీరోలతో సినిమాలు తీసి భారీగా నష్టపోయాడు. దీంతో సినిమా నిర్మాణంలో తన జోరు కూడా తగ్గించాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్ లోకి దిగి తన సంస్థ ద్వారా ఈస్ట్ గోదావరి హక్కులను తీసుకున్నారు. దాదాపు ఐదున్నర కోట్లను బయోపిక్ హక్కులు సొంతం చేసుకున్నారు. పండగ సీజన్ కావడంతో రిస్క్ చేసి అంత మొత్తం ఇన్వెస్ట్ చేశారు.

కానీ ఇప్పుడు సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతుంది. ఈ పండగ నాలుగు రోజులైనా సినిమా బాగా ఆడితే సగానికి పైగా రికవరీ అవుతుంది లేదంటే సినిమాను కొన్న అనీల్ సున్కర్ భారీగా నష్టపోతారు. ఆయన కథ ఇలా ఉంటే 14 రీల్స్ సంస్థ ఓవర్సీస్ హక్కులను కొన్న సంస్థతో డీల్ మాట్లాడుకొని మూడంతుల స్టేక్ తీసుకున్నారు. అక్కడ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. సినిమాని ఎక్కువ పెట్టి కొనడమే అసలు కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో నిర్మాతలు అడిగినంత ఇచ్చీ మరీ కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇప్పుడు లాభాలు మాత్రం ఆశించిన రేంజ్ లోరావడం లేదు.