న్యూ ఢిల్లీ, జనవరి 13: జగన్ కోడికత్తి కేసును ఎన్ఐఎ కి అప్పగిస్తే చంద్రబాబుకు వెన్నులో వణుకు మొదలైందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అంతేకాక దేశంలో ఎక్కడైనా ఈ కేసైనా విచారణ చేపట్టే అధికారం ఎన్ఐఏ కు ఉందని స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి విషయంలో ఎన్ఐఏ విచారణను స్వాగతించి జగన్ మీద దాడిపై ఎన్ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని, అధికారం పోతుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాల్లో స్వయం కృషితో ఎదగలేదని, కాంగ్రెస్తో కలవడంతోనే టీడీపీ పతనం మొదలైందని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.