న్యూ ఢిల్లీ, జనవరి 13: మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి రామ్నాధ్కోవింద్ శనివారం ఆమోద్రముద్ర వేసారు. దీనితో ఈబిల్లు చట్టరూపంలోనికి వచ్చేం దుకు వీలు కలుగుతోంది. ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు జనరల్కోటాలో ఉన్న అగ్రవర్ణ పేదలకు ఈ బిల్లుద్వారా రిజర్వేషన్ సౌకర్యం కలుగుతున్నది.
ఉన్నత విద్యావకాశా ల్లోను, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ బిల్లుద్వారా రిజర్వేషన్ అమలవుతున్నట్లు వెల్లడించారు. బుధవారం రాజ్య సభలో ఈబిల్లుకు 165 మంది సభ్యులు ఆమో దించిన సంగతితెలిసిందే.