న్యూ ఢిల్లీ, జనవరి 13: శనివారం సిడ్నీలో భారత్-ఆసిస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా 34 పరుగులతేడాతో ఓటమి పాలైంది. ఈ సందర్భంగా టీం ఇండియా సారథి విరాట్ కోహ్లి మాట్లాడుతూ నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయేసరికి ఆటగాళ్లలో కొంత నిరాశ ఆవరించింది.
తర్వాత ఓపెనర్ రోహిత్శర్మ(133) సెంచరీతో జట్టు స్కోరు పెంచినప్పటికీ విజయం సాధించలేకపోయాం అని అన్నారు. లక్ష్యం చేధించదగినది ఐనప్పటికి బ్యాటింగ్ సంతృప్తి కరంగా లేనందున విజయం దగ్గరగా వచ్చి చేజారింది. రోహిత్, ధోని నిలకడగా ఆడి స్కోరును పెంచారని అన్నారు. ఆటతీరును మెరుగుపర్చుకుని రెండో వన్డేలో సరిదిద్దుకుంటామని కోహ్లి పేర్కొన్నాడు.