పేదవారికి పెన్షన్లు ఇవ్వడం నేరమా...??

SMTV Desk 2019-01-13 11:09:40  Chandrababu about Pensions to poor people, Narendra modi, TDP, BJP

అమరావతి, జనవరి 13: కేంద్ర ప్రభుత్వం పై, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం రూ.30 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా వున్నా ప్రధాని మోదీ అడ్డుపడటం వల్ల ఇవ్వడం లేదని వార్తలొచ్చాయని, ప్రధానమంత్రి ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతేకాక పేదవారికి పెన్షన్ ఇచ్చామనే నెపంతో ఏపీకి రావాల్సిన రూ.16 వేల కోట్లలో కోత కోశారని ఆయన ఆవేదన వ్యక్తం చేవారు. పేదవారికి పెన్షన్లు ఇవ్వడం నేరమా?అని చంద్రబాబు ప్రశ్నించారు. 660 పురస్కారాలు ఏపీకి వచ్చాయని, వర్షాభావంతో పాటు 3 తుఫాన్లు ఎదుర్కొన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.