హైదరాబాద్, జనవరి 12: రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. చరణ్ గత చిత్రం రంగస్థలం తొలి రోజున 44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అయితే నిన్న విడుదల అయిన వినయ విధేయ రామ సినిమాకి డివైడ్ టాక్ రావడంతో, తొలిరోజు 40 కోట్ల గ్రాస్ ను రాబట్టే అవకాశము ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల కావడం వలన ఓపెనింగ్స్ కూడా భారీగానే వున్నాయి. అందువలన 40 కోట్ల గ్రాస్ .. 25 కోట్ల షేర్ తొలి రోజున సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే, ఇక కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు కలెక్షన్స్ లో నాన్ బాహుబలి రికార్డులను ఈ సినిమా అధిగమించే ఛాన్స్ కూడా ఉందని సమాచారం. మాస్ హీరోగా చరణ్ కి విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఇక యాక్షన్ తో పాటు ఎమోషన్ ను అద్భుతంగా ఆవిష్కరించడంలో బోయపాటి సిద్ధ హస్తుడు. ఈ కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అసలు వసూళ్లు ఈ అంచనాలకి ఎంత దగ్గరగా వుంటాయో చూడాలి.