బీజేపీకి చినబాబు వార్నింగ్...!!

SMTV Desk 2019-01-11 17:07:09  Nara lokesh, BJP, Narendramodi, TDP, CBI, RBI, YS Jagan mohan reddy

అమరావతి, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారత ప్రధాని నరేంద్ర మోడీ పై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ నియంతలా వ్యవహరిస్తున్నాడని, సిబిఐ, ఆర్బీఐ లాంటి గౌరవ ప్రదమైన వ్యవస్థలను మోడీ భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఏపీ బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంలో మోదీని నిలదీయాలని సవాల్ విసిరారు.

మొదీ జగన్ తో కలిసి ఏపీ అభివృద్దిని అడ్డుకుంటున్నారని, పాదయాత్ర ముగింపు సభలో వొక్క మాట కూడా మోడీకి వ్యతిరేఖంగా జగన్ మాట్లాడలేదని విమర్శలు చేశారు. మొన్న కర్ణాటకలో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనని రాబోయే రోజుల్లో ఏపీలో పూర్తి సినిమా చూపిస్తామని లోకేష్ హెచ్చరించారు.