'పసుపుకుంకుమ' పేరుతో మహిళలకు ఇళ్ళ పట్టాలు...

SMTV Desk 2019-01-11 15:42:00  Chandrababu, Janmabhomi maa ooru, Nellore, TDP

నెల్లూర్, జనవరి 11: ఏపీ ప్రభుత్వం చేపట్టిన జన్మ భూమి-మా ఊరు కార్యక్రమం ఈ రోజు నెల్లూరు జువ్వెలదిన్నెలో జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి-మా ఊరు కార్యక్రమం మనకు నిజమైన పండగని అన్నారు. అంతేకాక ఆదివారం కూడా పనిచేసిన అధికారులను అభినందించారు. పసుపు కుంకుమ పేరుతో మహిళలకు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు.

ఇళ్ళ పట్టాల జారీలో అవినీతికి చోటు లేకుండా చేశామన్నారు. అంతేకాక రక్ష పేరుతో బాలికలకు శానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీ ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. బోగోలుకు గిరిజన గురుకులపాఠశాల మంజూరుచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. గ్రామసభల నిర్వహణలో టెక్నాలజీని వినియోగిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.