హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ రాష్ట్ర పంచాయతి ఎన్నికల సందర్భంగా నేటి నుండి రెండో విడత నామినేషన్లు ప్రక్రియ మొదలు కానుంది. ఈ ప్రక్రియ నేటి నుండి ఈ నెల 13 వరకు కొనసాగిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 14న నామినేషన్ల పరిశీలన వాలీడ్ నామినేటెడ్ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 16న అప్పీలు చేసుకున్న నామినేషన్ పత్రాలపై విచారణ చేస్తారు. 4137 గ్రామ పంచాయతీలతో పాటు 36,620 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 172 మండలాల్లో నామినేషన్లు స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.