జగన్ కేసుపై హై కోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

SMTV Desk 2019-01-11 11:14:46  YS Jagan mohan reddy, Chandrababu, Jagan attempt to murder, High court, Petition, NIA

అమరావతి, జనవరి 11: వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి కేసును కేంద్రం ఎన్ఐఎ కు అప్పగించడాన్ని వ్యతిరేఖిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఇప్పటికే హై కోర్టు ఆదేశాలతో నిందుతుడు శ్రీనివాసరావును ఈ రోజు విజయవాడ హై కోర్టుకు హాజరుపరిచేందుకు తరలించారు.

ఈ రోజు ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో శ్రీనివాసరావును హాజరపరచనున్నారు. జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని రాష్ట్రప్రభుత్వం తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.