తిరుమల, జనవరి 10: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సామాన్య భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకొన్నారు. పాదయాత్రను ముగించుకొని గురువారం నాడు జగన్ తిరుపతికి చేరుకొన్నారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరారు.
సాయంత్రం 4:40 గంటలకు జగన్ తిరుమల కొండపైకి చేరుకొన్నారు. తిరుమల కొండపై ఉన్న ఓ గెస్ట్హౌజ్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్న తర్వాత సామాన్య భక్తుడి మాధిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకొన్నారు. జగన్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.
తిరుమల కాలిబాటలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని నరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన శ్రీ వైయస్ జగన్. అనంతరం శ్రీవారి సర్వదర్శనానికి పయనమైన జననేత.#YSJaganInTirumala pic.twitter.com/4WxlCYT9KS
— YSR Congress Party (@YSRCParty) January 10, 2019