అమరావతి, జనవరి 10: అమరావతిలో గురువారం ఉదయం జరిగిన వెల్కం గ్యాలరీ శంకుస్తాపన కార్యక్రమంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపి, సింగపూర్ సంబంధాల్లో కీలకమైన ముందడుగు పడిందని అంతేకాక ఏపీతో బంధం రోజురోజుకీ బలపడుతోందని తెలిపారు. మొదటి దశలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని,అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
వెల్కం గ్యాలరీ అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తుందని పేర్కొన్నారు. గ్యాలరీ ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని ఆయన అన్నారు. సింగపూర్, జపాన్, జర్మనీల నుంచి వెల్కం గ్యాలరీ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే అని.. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఉంటాయని ఈశ్వరన్ పేర్కొన్నారు.
Live from the foundation laying ceremony of the Welcome Gallery in the presence of Mr. S Iswaran, Singapore Ministe… https://t.co/fM5P5XZZra
— N Chandrababu Naidu (@ncbn) January 10, 2019