35/3 నుంచి 35 పరుగులకే ఆలౌట్, ఇండోర్ క్రికెట్

SMTV Desk 2019-01-09 18:03:46  35/3, Ranji Cricket, Madhya Pradesh, Andhra Pradesh

ఇండోర్, జనవరి 9: 35 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. దానికి మరొక్క పరుగు కూడా జోడించకుండానే ఆలౌటైంది. 23 బంతుల వ్యవధిలో వొక్క పరుగు కూడా స్కోరు బోర్డులో చేరకుండానే ఆరు వికెట్లు కోల్పోయిందా టీమ్. ఈ వింత ఘటన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌‌లో చోటు చేసుకుంది. 23 బంతుల వ్యవధిలో వొక్క పరుగు కూడా చేయకుండా మధ్యప్రదేశ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది.

మరో బ్యాట్స్‌మన్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. క్రికెట్‌లో ఇలాంటి వింత ఘటనలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్, కేవలం 35 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ 307 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.