'లక్ష్మీస్ ఎన్టీఆర్’ రెండో పాట విడుదల..

SMTV Desk 2019-01-08 19:12:14  Ram Gopal Varma, Lakshmi's NTR, Enduku Song

హైదరాబాద్, జనవరి 8: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం, వ్యక్తిగత జీవితంలో లక్ష్మీ పార్వతి పాత్రను ప్రధానంగా ఇందులో చూపుతామని వర్మ గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాలో ‘ఎందుకు అనే రెండో పాటను ఈరోజు సాయంత్రం గం.5 లకు రిలీజ్ చేశారు. కాగా ‘ఎందుకు పాట టీజర్ ను ఈరోజు మధ్యాహ్నం వర్మ విడుదల చేశారు. ‘జయసుధ, జయప్రద, శ్రీదేవి... వీరందరిని కాదని ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు?.. ఎందుకు? అంటూ సాగే పాట టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో వర్మ ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్దలుగా చలామణి అవుతున్న నిజాలని .. నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలని బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ముఖ్య ధ్యేయం అన్నారు. .

ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని రెండోపాట ‘ఎందుకు విడుదలైంది. ‘జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వారిని కాదని లక్ష్మీపార్వతిని ఎందుకు?.. ఎందుకు? అంటూ ఈ పాట సాగింది. ‘ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. జయసుధ, జయప్రద, శ్రీదేవి, కృష్ణకుమారి, సావిత్రి, అంజలీదేవి.. వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు.. ఎందుకు.. ఎందుకు.. ఎన్టీఆర్..ఎన్టీఆర్.. సీబీఎన్, ఎన్బీకే, దగ్గుబాటి, హరికృష్ణ.. వీళ్లందరినీ కాదని ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు..ఎందుకు అంటూ ఈ పాట సాగింది.