జనవరి 8: భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో రెడ్మీ ఫోన్లు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు రెడ్మీ నోట్ 5 ప్రో రూ.4,000 తగ్గింపుతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫోన్కు అప్గ్రేడ్ వర్షన్ రెడ్మీ నోట్ 6 ప్రో రిలీజైనా సరే, రెడ్మీ నోట్ 5 ప్రో మోడల్కు ఇంకా డిమాండ్ ఉంది. కెమెరాతో పాటు ఇతర అంశాల్లో రెడ్మీ నోట్ 5 ప్రో పెర్ఫామెన్స్ యూజర్లకు బాగా నచ్చేసింది. ఈ ఫోన్ ధరను భారీగా తగ్గించింది షియోమి. ఏకంగా రూ.4,000 తగ్గించినట్టు స్మార్ట్ఫోన్ యూజర్లకు శుభవార్త చెప్పింది. షియోమి #High5 క్యాంపైన్ పేరుతో భారీ డిస్కౌంట్ ఇచ్చింది.
➤ 4జీబీ+64జీబీ మోడల్ ధరను రూ.15,999 నుంచి రూ.12,999,
➤ 6జీబీ+64జీబీ ధరను రూ.17,999 నుంచి రూ.13,999 ధరకు తగ్గించింది.
➤ మరోవైపు ఎంఐ ఏ2 పైనా రూ.4,500 తగ్గించింది షియోమి. రెడ్మీ నోట్ 5 సిరీస్లో కోటికిపైగా ఫోన్లను అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది.