మసీదుకి తాకిన శబరిమల సెగ..

SMTV Desk 2019-01-08 13:26:48  sabarimala temple, Women entry in vavar masjid, kerala, vavar masjid

కేరళ, జనవరి 8: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంతో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ముగ్గురు మహిళలు శబరిమల దగ్గరే ఉన్న వావర్ మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు ఈ ముగ్గురిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. వీరంతా హిందూ మక్కల్ కట్చి సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు.

గతంలో మీడియా సమావేశం నిర్వహించిన ఈ ముగ్గురు మసీదులోకి వెళ్లితీరుతామని ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంను అనుమతించినప్పుడు, మసీదులోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. అయితే, ఈ ముగ్గురు మహిళలపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.