అహమ్మదాబాద్, జనవరి 8: గుజరాత్ లోని అబుదాస కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్ భానుషలీ రైలులో ప్రయాణిస్తున్నసమయంలో హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆయనను అతి సమీపం నుంచి తుపాకితో కాల్చి చంపారు. కాగా, ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించింది. సజయీ నగరీ ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన గత రాత్రి జరిగింది. గతంలో జయంతీలాల్ గుజరాత్ రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా, అబుదాస ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనపై అత్యాచార ఆరోపణలు రాగా, తన పదవికి రాజీనామా చేశారు. ఆపై డబ్బు కోసమే తన భార్య ఇలా జయంతీలాల్ పై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆమె భర్తే స్వయంగా చెప్పడం గమనార్హం.
అయితే, జయంతీలాల్ హత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. వ్యక్తిగత పగతోనే జయంతీలాల్ ను హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నా, ఘటనా స్థలిలో ఓ తుపాకీ లభించడంతో, ఆయన తనంతట తానుగా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు సాగుతుందని పోలీసు అధికారి వొకరు తెలపారు.