కేంద్ర సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఓవైసీ

SMTV Desk 2019-01-07 18:44:14  Asaduddin owasis, MIM, EBC Reservation, Central cabinet, Modi

హైదరాబాద్, జనవరి 7: ఈ రోజు కేంద్ర కేబినెట్ అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని అనేక మంది రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకొన్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తప్పుబట్టారు. సోమవారం నాడు ఆయన కేంద్ర కేబినెట్ తీసుకొన్న నిర్ణయంపై స్పందించారు. దళితులకు సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక పథకాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసమే రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.