కేంద్ర కేబినెట్ నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ కృష్ణయ్య

SMTV Desk 2019-01-07 18:28:26  R Krishnaiah, Congress, BC Leader

హైదరాబాద్, జనవరి 7: సోమవారం కేంద్ర కేబినెట్ అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను కల్పిస్తూ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ నిర్ణయం పై బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇష్టమొచ్చినట్టు రిజర్వేషన్లు ఇస్తామంటే కుదరదని ఎలా పడితే అలా రిజర్వేషన్లను 60 శాతానికి పెంచుతామంటే ఊరుకోబోమని చెప్పారు.

అంతేకాకుండా కేంద్ర కేబినెట్ తీసుకొన్న నిర్ణయంపై ఆందోళనలను నిర్వహిస్తామని కృష్ణయ్య చెప్పారు. మోడీకి దమ్ముంటే జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసమే మోడీ ఈ నిర్ణయం తీసుకొన్నారని ఆయన ఆరోపించారు.