జనవరి, 7: షివోమి లో వచ్చినా ఎంఐ ఏ 2 స్మార్ట్ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ మేరకు షివోమి ట్విటర్లో వివరాలను షేర్ చేసింది. ఇంతకుముందెన్నడూ లేని తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఎంఐ ఏ2 స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లపై ఈ తగ్గింపును చేయనుంది.
ఎంఐ ఏ2 4జీబీ ర్యామ్, 64 జీబీ ధరను రూ. 13, 999లకే అందిస్తోంది. ఎంఆర్పీ ధర రూ.17,999.
6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 15,999 కే లభ్యమవుతోంది. అసలు ధర రూ. 20,500.
అమెజాన్, ఎం.కామ్ అన్లైన్ స్టోర్లతోపాటు, ఎంఐహోమ్ ఆఫ్లైన్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు సేల్ ప్రారంభం. ఇదే అతి పెద్ద హై ఫై (5) ప్రకటన అని షివోమి ఇండియా ట్వీట్ చేసింది. ఇంకా ఇలాంటి ఆఫర్లను ఇంకా నాలుగు ప్రకటించనుంది.