చంద్రబాబుపై మండిపడ్డ కేంద్ర మంత్రి..

SMTV Desk 2019-01-07 13:45:00  piyush goyal, chandrababu, mahakutami

న్యూఢిల్లీ, జనవరి 7: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి అట్టర్‌ప్లాప్‌ అయిన కూడా ఆంధ్రప్రదేశ్ లో మరల అటువంటి దుష్టకూటమి ఏర్పాటుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్‌ కలవడం ఇష్టపడని తెలంగాణ ప్రజలు తగిన బుద్ధిచెప్పి పంపారని, ఆంధ్రాలోనూ బాబుకు గుణపాఠం చెప్పేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఆనాడు హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీతోనే లాభం ఉంటుందని అంగీకరించిన టీడీపీ నేతలు ఇప్పుడు హోదా పేరుతో పార్లమెంటు ముందు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ప్యాకేజీ ప్రకటించినప్పుడు పార్లమెంట్ లో ధన్యవాద తీర్మానం చేయడం, ఆ తర్వాత మీరు సంబరాలు చేసుకున్న విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. విశాఖపట్టణం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు.