న్యూఢిల్లీ, జనవరి 5: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఢిల్లీలో ప్రజాదరణ పెరుగుతున్నట్లు ‘ఇండియా టుడే సంస్థ చేపట్టిన పొలిటికల్ స్టాక్ ఎక్ఛ్సేంజి సర్వేలో వెల్లడైంది. గత ఏడాది అక్టోబర్లో చేపట్టిన సర్వే కంటే తాజా సర్వేలో 2 శాతం వరకు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగిందని తేలింది. సుమారు 49% మంది ప్రజలు కేజ్రీవాల్ పాలన సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించారు. తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు కేజ్రీవాల్ వైపే అత్యధికులు మొగ్గు చూపగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, మాజీ సీఎం షీలా దీక్షిత్ ఉన్నారు.
కాగా, ప్రధాన మంత్రి పదవికి నరేంద్ర మోదీకి 49% మంది, రాహుల్ గాంధీకి 40% మంది అనుకూలంగా సమాధానమిచ్చారు. ఈ సర్వేను యాక్సిస్ మై ఇండియా సంస్థ 2018 డిసెంబర్ 27 నుంచి 2019 జనవరి 3 వరకు చేసింది.