మరోసారి టీడీపీ పై ధ్వజమెత్తిన జీవీఎల్

SMTV Desk 2019-01-04 21:00:36  GVL Narshimharao, Chandrababu, Nara lokesh, AP, Member of rajyasabha, Nara lokesh

అమరావతి, జనవరి 4: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరశింహారావు తెదేపా పై మరోసారి తన అధికార ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. టీడీపీ టోటల్‌గా దొంగల పార్టీగా మారిందని జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం జీవీఎల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రా ప్రజల నోట్లో మట్టికొట్టి జేబులు నింపుకొన్న చంద్రబాబు ఎదుట నిరసనలు చేపడుతామన్నారు. లక్షల కోట్ల అవినీతి చేసిన చంద్రబాబను నిలదీస్తామని చెప్పారు. అధికార అహంకారానికి ఎన్నికల ఓటమితో పాటు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని తన ట్వీట్‌లో జీవీఎల్ అభిప్రాయపడ్డారు.