చలి పిడుగుకు ఇద్దరు వృద్దులు మృతి

SMTV Desk 2019-01-04 15:48:06  Telangana, Winter, Weather, Temperature, Two mens died

భద్రాద్రి, జనవరి 4: రాష్ట్రంలో చలి తీవ్రత వల్ల ఇద్దరు వృద్దులు కన్నుమూశారు. రోజు రోజుకి చలి తీవ్రత అధికంగా పెరగడంతో రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో చలి తీవ్రతకు ఇద్దరు వృద్ధులు మృత్యువాత పడ్డారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం అమెర్థా ఎస్ సి కాలనీకి చెందిన యాస రాజేంద్రం(65) అనారోగ్యంతో బాధపడుతుండగా చలి తీవ్రత ఎక్కువ కావటంతో మృతి చెందాడు. అలాగే ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి గ్రామానికి చెందిన మస్తానమ్మ (85) చలి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు విడిచింది.