న్యూ ఢిల్లీ,జనవరి 2: జీ మెయిల్ ద్వారా వొక దొంగ దొరికాడు. ఏదైనా కేసును ఛేదించేందుకు పోలీసులు పలు రకాలుగా ప్రయత్నిస్తుంటారు. దానిలో భాగంగానే జీ మెయిల్ ద్వారా గుర్తించి సక్సెస్ అయ్యారు. ఢిల్లీకి చెందని నగల వ్యాపారి గురుప్రీత్ సింగ్ వద్ద జస్వీందర్ సింగ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. తన ఆఫీసుకు సంబంధించి రూ.18 లక్షలతో జస్వీందర్ సింగ్ పారిపోయాడని గురుప్రీత్ డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో భాగంగా తన ఆఫీసులో జస్వీందర్ ఉపయోగించిన సిస్టమ్ను పోలీసులు చెక్ చేశారు. సిస్టమ్లో అతని జీమెయిల్ లాగ్ అవుట్ చేయలేదని గుర్తించి వెంటనే జస్వీందర్ ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా లొకేషన్ను గుర్తించి, చండీఘర్లో ఉన్నట్టు తెలుసుకున్న జస్విందర్ ని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.