నేడు చిత్తూర్ పర్యటనలో చంద్రబాబు

SMTV Desk 2019-01-02 13:25:07  AP, CM, Chandrababu, Chittoor

విజయవాడ, జనవరి 2: ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు చిత్తూర్ జిల్లాలో పర్యటనకు బయల్దేరారు. జిల్లా పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గం కుప్పంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆరో విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని సిఎం ప్రారంభించారు. తరువాత వడ్డేపల్లి గ్రామంలో పాదయాత్ర చేసి ప్రభుత్వం పేదలకు నిర్మించిన గృహాలను, ఆపై హార్టికల్చర్ హబ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సును సీఎం ప్రారంభించనున్నారు. ఆ తరువాత పోలీస్‌హౌస్‌‌ను సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.