విజయవాడ, డిసెంబర్ 30: నూతన సంవత్సర రోజున మందేసి రోడ్డెక్కితే కేసే పెడతామని విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. డిసెంబర్ 31న న్యూ ఈయర్ సందర్భంగా 30 బ్రీత్ ఎనలైజర్ టీములు, 12 చెక్ పోస్టులు సిద్ధం చేసామన్న సిపి నగరంలో 18 ఈవెంట్లకు మాత్రమే అనుమతి ఇచ్చామని ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.మైనర్లకు లిక్కర్ అమ్మితే కఠిన చర్యలు తప్పవని ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. రెస్టారెంట్లు అర్థరాత్రి1 గంట వరకు, బార్లు 12 గంటల తర్వాత మూయాల్సిందేనని స్పష్టం చేశారు. న్యూ ఈయర్ ఈవెంట్లలో అశ్లీల నృత్యాలు చేస్తే ఊరుకోబోమని విజయవాడ సిపి వార్నింగ్ ఇచ్చారు.