అనంతపురంలో టీడీపీకి భారీ షాక్..

SMTV Desk 2018-12-30 15:51:59  Chandrababu, Gurnadh reddy, TDP

అనంతపురం, డిసెంబర్ 30: నిన్న కర్నూలు జిల్లా నేత రాంపుల్లారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవకముందే తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ నేత గుర్నాథ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఐదుగురు కార్పొరేటర్లు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని గుర్నాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన బాగుందని తాను వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి తప్పు చేశానని గుర్నాథ్ రెడ్డి తెలిపారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. కాగా, గుర్నాథ్ రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరే అవకాశముందని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పలాసలో కొనసాగుతున్న ప్రజాసంకల్ప యాత్ర ముగిశాఖ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పేర్కొన్నాయి.