అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట..!

SMTV Desk 2018-12-30 11:55:08  Agri Gold, Hai land, AP Govt

విజయవాడ, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ బాధిత సంఘం నేతలు విశ్వేశ్వరరెడ్డి, ముప్పాళ్ల వెంకటేశ్వరరావుతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో వీరంతా ఈరోజు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రులు నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆందోళనకారులను పరామర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.

ఈ సందర్బంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ.. జనవరి నెలాఖరు నుంచి అగ్రిగోల్డ్ చెల్లింపు ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. తొలుత చిన్న మొత్తాల బాండ్లను చెల్లిస్తామనీ, రూ.5 వేల బాండ్ల నుంచి దశలవారీగా మిగిలినవాటిని అందజేస్తామని వెల్లడించింది. ఈ విషయమై జనవరి 12న కోర్టులో అఫిడవిట్ సైతం దాఖలు చేస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా నోటిఫై చేయని ఆస్తులను జనవరి చివరిలోగా వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హాయ్ ల్యాండ్ ఆస్తులను కొనేందుకు ముందుకొచ్చేవారికి రాయితీలు ఇస్తామని ప్రకటించారు.