తిరుమలకి టీడీపీ నేతల పాదయాత్ర

SMTV Desk 2018-12-29 19:41:09  AP, CM, Chandrababu, Party leaders, Tirumala

మచిలీపట్నం, డిసెంబర్ 29: నగరానికి చెందిన టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ సీఎం గా చంద్రబాబే కావాలని కోరుకుంటూ తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. 2019లో టీడీపీ అధికారంలోకి రావాలని కోరుతూ శనివారం పలువురు టీడీపీ నేతలు అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.మచిలీపట్నం నుంచి పాదయాత్రగా తిరుపతికి చేరుకున్న వీరు అలిపిరి పాదాల మండపం నుంచి కాలి నడకన తిరుమల వెళ్లారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని వారు ఈ సందర్భంగా స్వామివారిని కోరుకున్నారు. వెంకన్న ఆశీస్సులు టీడీపీకి ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని తాము పాదయాత్ర చేసినట మచిలీపట్నం టీడీపీ నేతలు ఈ సందర్భంగా వివరించారు.