'సాక్షి'పై ఆగని శ్రీరాం సమరం

SMTV Desk 2018-12-29 19:02:48  Paritala sriram, Paritala sunita, TDP, MP, Sakshi media, YSRCP, Thopu durthi prakash

అమరావతి, డిసెంబర్ 29: ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం తనపై వ్యతిరేకంగా సాక్షి దినపత్రిక వార్తలు రాస్తుందని టీడీపి కార్యకర్తలతో కలిసి ప్రాంతీయ సాక్షి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. పరిటాల సునీతకు సంబంధించిన ఓ వ్యవహారంపై సాక్షి దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. తాజాగా ఆయన ఆ పత్రికపై ట్విట్టర్ లో ఓ వ్యాఖ్య చేశారు. "నా మీదనో నా కుటుంబం మీదనో తప్పుడు రాతలు రాసినా పట్టించుకోను. నాకు నష్టం జరిగినా నేను పెద్దగా తీసుకోను. అదే ప్రజలకు, సమాజానికి నష్టం జరుగుతుంది ప్రమాదంగా మారుతుందంటే ఏ మాత్రం సహించను. ఎంత దూరమైనా వెళ్తా" అని ఆయన వ్యాఖ్యానించారు.




"అభివృద్ధికి అడ్డంకిగా మారి తప్పుడు రాతలతో నిందారోపణలతో రెచ్చిపోతే నేడు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపాను... మీరు మరోసారి ఇలా చేస్తే మరో మెట్టు ఎక్కుతా" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.






ఇకపోతే ఈ దర్నాకి శ్రీరాం అభిమానులు తండోపతండాలుగా వచ్చారు.