న్యూఢిల్లీ, డిసెంబర్ 29: గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200 కోట్లు సమీకరించనున్నదని ఆ బోర్డు వెల్లడించింది. ఎంప్లాయీ స్టాక్ పర్చేజింగ్ స్కీమ్లో (ఈఎస్పీఎస్) భాగంగా ఉద్యోగులకు షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందడం కోసం అసాధారణ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలి? షేర్ల ధర ఎంత ఉండాలి ? ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి తదితర వివరాలను త్వరలోనే డైరెక్టర్ల కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొంది.