అమరావతి, డిసెంబర్ 28: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన వాయిదా పడింది. జనవరి 6 న ఏపీ కి రావాల్సిన మోడీ కొన్ని ఆకస్మిక కార్యక్రమాల వల్ల మోడీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కేరళ టూర్ తరువాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చేల కార్యక్రమాల రూపకల్పన జరిగింది. కాని అది కాస్త వాయిదా పడింది. మళ్ళీ జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి లో మోడీ ఏపీ కి వచ్చే అవకాశాలు వున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలుపాయి.