విశాఖపట్నం, డిసెంబర్ 28: కేంద్రం విశాఖ ఉత్సవ్ కు షాక్ ఇచ్చింది. విశాఖ ఉత్సవ్ లో ఎయిర్ షో కు కేంద్రం నిరాకరించింది. ఎయిర్ షో కు మొదట అనుమతి ఇచ్చిన కేంద్రం ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంది.
ఇప్పటికే విశాఖకు చేరుకున్న ఎయిర్ షో సిబ్బందిని రక్షణ శాఖ వెనక్కి పిలిపించుకుంది. ఇదంతా మోడీ ప్రభుత్వం కక్ష్య సాధింపు కోసమే ఎయిర్ షోకు అనుమతి ఇవ్వలేదంటూ టిడిపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.