హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయని, పొత్తుల వల్ల ఓడిపోయామనేది సబబు కాదని, ఏపి సియం చంద్రబాబు ప్రచారంతో ఎలాంటి నష్టం జరగలేదని, ఆయన ప్రచారం మొదలుపెట్టిన తర్వాతనే తెలంగాణలో కాస్త పోటీ వాతావరణం ఏర్పడిందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలైన ఓట్లకు ,లెక్కించిన ఓట్లకు తేడా ఉందని ఆరోపించారు.
ఓటమిపై సమీక్షంచుకుని వచ్చే పార్లమెంటు ఎనికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన అన్నారు. ఐతే పొత్తుల విషయంలో కొంత ముందుగా స్పందించి ఉంటే మరింత లాభం కలిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. సియం ప్రమాణ స్వీకారం జరిగి ఇన్ని రోజులైనా..ఇప్పటివరకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగలేదని, అసెంబ్లీని సమావేశపరచకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో పొత్తులపై అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ చెప్పారు.