హైదరాబాద్, డిసెంబర్ 28: నేడు నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకులు జరుగనున్నాయి. రాంనగర్, హరినగర్లో ఉదయం పదిన్నర గంటలకు పార్టీ ఆవిర్బావ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని మాజీ కార్పొరేటర్ ఆర్. కల్సనాయాదవ్ తెలిపారు. మాజీ ఎంపి అంజన్కుమార్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యంలో హాజరుకావాలని కల్పనాయాదవ్ వొక ప్రకటనలో కోరారు.