అమరావతి, డిసెంబర్ 27: గురువారం ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. దేశంలో బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కూటములే ఉంటాయని, మూడో ఫ్రంట్ అనేది ఎలా సాధ్యమని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాక్టీకల్గా మాట్లాడాలని ఆయన సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే వారంతా కాంగ్రెస్ ఫ్రంట్లో చేరాలని బాబు కోరారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ బెంగాల్, వొడిశా సీఎలతో భేటీ అయ్యారు. అఖిలేష్ యాదవ్ హైద్రాబాద్కు వచ్చి కేసీఆర్ ను కలుస్తానని చెప్పిన విషయం తెలిసిందే.