సీఎల్పీల విలీనం కేసు : వచ్చే ఏడాదికి వాయిదా

SMTV Desk 2018-12-27 18:35:13  Congress party, TRS, MLA, LPC, MLC, Shabbir ali, High court

హైదరాబాద్, డిసెంబర్ 27: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తెలంగాణ శాసనమండలిలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ వాటిపై హై కోర్టులో పిటిషన్ దాఖలు వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగ ఈ కేసు విచారణను హై కోర్టు వచ్చే ఏడాది జనవరి 3 కు వాయిదా వేసింది. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభపక్షంలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిసెంబర్ 24వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం నాడు విచారణ సాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కేసును వచ్చే ఏడాది జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. శాసనమండలిలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.