ప్రతిపక్షాలను అనగ తొక్కేందుకు చంద్రబాబు కుట్రలు??

SMTV Desk 2018-12-27 17:01:30  AP,CM, TDP, Chandrababu, BJP, Narenda modi, MLC, Madhavan

అమరావతి, డిసెంబర్ 27: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన మంత్రి ఏపీ పర్యటనపై మాధవ్ స్పందిస్తూ మోడీ రాకతో బాబుకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ రోజు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 6న గుంటూరులో నిజం పిలుస్తుంది పేరుతో మెడి సభ జరగనుందని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు నాలుగేళ్లుగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మాధవ్‌ విమర్శించారు.

శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు 600 హామీలు ఎందుకు అమలు‌ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపకుండా దుష్ప్రచారం ‌చేస్తున్నారని మాధవ్ విమర్శించారు. పోలవరం కోసం ఎంతో కొంత చేసిన ఏకైక నాయకుడు వైఎస్ మాత్రమేనని.. పోలవరం ప్రాజెక్టును ఎన్నడూ టిడిపి మ్యానిఫెస్టోలో చేర్చలేదని ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు.