ముగిసిన తుంగభద్ర నదీ బోర్డు సమావేశం

SMTV Desk 2018-12-27 16:20:15  Thungabhadra river, Chairman rangareddy

హైదరాబాద్, డిసెంబర్ 27: ఇవాళ ఛైర్మన్‌ రంగారెడ్డి అధ్యక్షతన తుంగభద్ర నదీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపి,కర్ణాటక నీటిపారుదల ఇంజీనీర్లు, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బోర్డు ఛైర్మన్‌ రంగారెడ్డి మాట్లాడుతూ మూడు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

అలాగే తుంగభద్రపై 40 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక ప్రతిపాదించిదని దీనిపై తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాలు కోరినట్లు చెప్పారు. ఆర్డీఎస్, తుంగభద్ర కుడికాలువ లోలెవల్ కాల్వ ఆధునీకరణపై కూడా సమావేశంలో చర్చించాం అని ఆధునీకరణ పూర్తయ్యాక ఆర్డీఎస్‌ను బోర్డు పరిధిలోకి తీసుకుంటామన్నారు. తెలంగాణ ఈఎన్‌సీ స్పందిస్తూ.. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఆధునీకరణ పూర్తయ్యాక బోర్డు పరిధిలోకి ఆర్డీఎస్‌ను తీసుకోవాలని కోరామన్నారు. కర్నాటక ప్రతిపాదనలపై ప్రభుత్వ స్థాయిలోనూ చర్చించాల్సి ఉందన్నారు.