లక్నో, డిసెంబర్ 27: ఉత్తరప్రదేశ్ లో సాక్షాత్తూ పోలీస్ అధికారి కూతురిపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలిస్ అధికారి కూతురైన మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఇంటికి రప్పించుకున్న ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. వారి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. నలుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
యూపీలోని కాన్పూర్ లో ఉంటున్న ఓ బీటెక్ విద్యార్థికి అదే ప్రాంతానికి చెందిన పోలీస్ ఇన్ స్పెక్టర్ కుమార్తె(12)తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సదరు బాలికకు మాయమాటలు చెప్పి తన ఫ్లాట్ కు రప్పించుకున్న బీటెక్ విద్యార్థి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదుతో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.