అమరావతి, డిసెంబర్ 27: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్ ఫౌండేషన్ను కాంక్రీట్తో నింపే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం నిర్విరామంగా మూడున్నర రోజులపాటు కొనసాగుతూ ఉంటుంది.
సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాలను అయిదు టవర్లుగా నిర్మిస్తున్నారు. ఇందులో రెండో భవన పునాది పనులకు చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాఫ్ట్ ఫౌండేషస్ మాస్కాంక్రీట్ విధానంలో పునాది వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలను సాకారం చేసే రీతిలో భారత దేశంలో ఎక్కడా లే నివిధంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది. రేపు ఉదయం 8గం'50ని"కి సచివాలయం శంకుస్థాపన జరగనుంది. ఇది రాష్ట్ర ప్రగతి పథంలో మరో కలికితురాయిగా నిలవనుంది @PrajaRajadhani https://t.co/Z7AJDRLZ6C
— Guntur Collector (@CollectorGuntr) December 26, 2018
Live from the foundation stone laying ceremony of AP Secretariat & HODs Office Complex, Amaravati. https://t.co/0pziiMMedq
— N Chandrababu Naidu (@ncbn) December 27, 2018