ఏపీ సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

SMTV Desk 2018-12-27 11:34:42  Andhrapradesh, CM, Chandrababu, Roft foundation

అమరావతి, డిసెంబర్ 27: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం నిర్విరామంగా మూడున్నర రోజులపాటు కొనసాగుతూ ఉంటుంది.

సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాలను అయిదు టవర్లుగా నిర్మిస్తున్నారు. ఇందులో రెండో భవన పునాది పనులకు చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాఫ్ట్‌ ఫౌండేషస్‌ మాస్‌కాంక్రీట్‌ విధానంలో పునాది వేస్తున్నారు.